నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ వ్యూహాలు, టెక్నాలజీ మార్పులు, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రసంగం చేశారు.
బిజినెస్ న్యూస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)ను ఘనంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani ), జియో ప్లాట్ఫారమ్స్ అధ్యక్షుడు ఆకాష్ అంబానీ చేసిన ప్రకటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సమావేశం గణేష్ చతుర్థి సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో వాటాదారులకు ముఖేష్ అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జియో భవిష్యత్తు రోడ్మ్యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటిగ్రేషన్, ఆర్థిక ఫలితాల గురించి ప్రకటించారు.