మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో 1.67 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ఈ ఎన్నికలకు ప్రభుత్వం రూ.350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇప్పటికే రూ.3.08 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. మొత్తం 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 11 గుర్తింపు పొందిన పార్టీలు పోటీ పడనున్నాయి.

**షెడ్యూల్‌ వివరాలు:**

* అక్టోబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్లు ప్రారంభం.

* అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌.

* అక్టోబర్‌ 31, నవంబర్‌ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు.

* నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.

మొత్తం 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది.


---