PVN Madhav VS Rahul Gandhi: రాహుల్ గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.

రాజమండ్రి, సెప్టెంబర్1, (ఆంధ్రజ్యోతి): బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) తల్లి పట్ల నీచంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆందోళన చెంది ప్రతిరోజూ అబద్దాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు పీవీఎన్ మాధవ్.